ఎన్టీఆర్ దాచిపెట్టిన ఆ ఇద్దరూ ఎవరో తెలిసిపోయింది..
on Oct 30, 2017
'జై లవకుశ' ప్రీ రిలీజ్ ఫంక్షన్ గుర్తుండే ఉంటుంది. ఇక ఆ ఫంక్షన్ లో ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు కూడా గుర్తుండే ఉంటాయి. ఈ సినిమాలో నటించడానికి ఇద్దరు ముఖ్య కారకులు ఉన్నారని.. ఈ సినిమా చేయాలా వద్దా అన్న డైలమాలో ఉన్నపుడు తనకు అత్యంత సన్నిహితులైన ఇద్దరు దర్శకుల్ని సలహా అడిగానని.. వాళ్లిద్దరూ ఓకే అన్నాకే ఈ సినిమా చేశానని కానీ వారెవరో ఇప్పుడే చెప్పనని... సినిమా హిట్ అయితేనే చెబుతానని అందరికీ ట్విస్ట్ ఇచ్చాడు. అంతే అప్పటినుండి ఆ ఇద్దరు అభిమానులు ఎవరబ్బా.. అని అభిమానులే కాదు.. చాలామంది జుట్టుపీకున్నారు. అంతేకాదు కొంత మంది ఆ ఇద్దరూ ఎవరో కాదు... ఎస్ఎస్ రాజమౌళి, వీవీ వినాయక్ అని గెస్ చేసి చెప్పారు. ఇక ఆ తరువాత సినిమా రిలీజ్ అవ్వడం.. హిట్ టాక్ తెచ్చుకోవడం అంతా జరిగిపోయింది. కానీ అప్పుడు ఎన్టీఆర్ తాను చెప్పిన మాటలు మర్చిపోయాడేమో కానీ.. అభిమానులు మాత్రం మర్చిపోలేదు. ఈ విషయంపై ఓ అభిమాని రచయిన కోన వెంకట్ ను సోషల్ మీడియా ద్వారా ఈ విషయంపై ప్రశ్నించగా... దానికి కోన వెంటనే క్లారిటీ ఇచ్చేశాడు. ఎన్టీఆర్ వెనుక ఉన్న ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో కాదు.. కొరటాల శివ, ఎస్ఎస్ రాజమౌళి అని చెప్పాడు. అంతేకాదు.. అభిమానులు ఓ 50 పర్సెంట్ సక్సెస్ అయ్యారని కూడా అన్నాడు. మొత్తానికి నాడు ఎన్టీఆర్ పెట్టిన సస్పెన్సు ఇన్నాళ్లకు బయటపడింది.