కలెక్షన్ కింగ్కు మరో అరుదైన గౌరవం
on Oct 1, 2017
హీరోగా, కమెడియన్గా, విలన్గా, నిర్మాతగా, రాజకీయ వేత్తగా, విద్యావేత్తగా తనదైన ముద్ర వేసిన కలెక్షిన్ కింగ్, కళాప్రపూర్ణ, పద్మశ్రీ మోహన్బాబుకు కిర్తీ కిరీటంలో మరో కలికితురాయి చేరింది. చెన్నైలోని ఎంజీఆర్ విశ్వవిద్యాలయం ఆయనకు డాక్టరేట్ ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రముఖ హీరో, మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ఈ నెల 4వ తేదీన మోహన్ బాబు డాక్టరేట్ను అందుకోనున్నాడు. కంగ్రాట్స్ నాన్నా..ఎంతో గర్వపడే క్షణమని మనోజ్ సంతోషం వ్యక్తం చేస్తూ..మోహన్ బాబు ఫోటోను పోస్ట్ చేశాడు. తన సుధీర్ఘ నటజీవితంలో మోహన్బాబు సుమారు 560 సినిమాల్లో నటించారు..లక్ష్మీప్రసన్నా పిక్చర్స్ బ్యానర్పై 50కి పైగా సినిమాలు నిర్మించారు.