పవర్ స్టారా.. మజాకా?
on Sep 13, 2017
రాజమౌళి- ప్రభాస్... క్రేజీ కాంబినేషన్ తో... వందల కోట్లు ఖర్చుపెట్టి తీసిన ‘బాహుబలి’ లాంటి సినిమాను నైజాం రైట్స్ 30 కోట్లకు కొంటే... పవర్ స్టార్ నటించిన మామూలు సినిమా నైజాం రైట్స్ 29 కోట్లకు అమ్ముడైంది. దీన్ని బట్టి... ఎవరు టాలీవుడ్ నంబర్ వన్? అనేది తేలిపోయిందిగా. దటీజ్ పవర్ స్టార్. త్రివిక్రమ్- పవన్ కల్యాణ్ సినిమా... పేరు కూడా ఇంకా ఖరారు కాలేదు. ఈ సినిమా షూటింగ్ అబ్రాడ్ లో జరుగుతోంది. ఇంతలోనే.. నైజాం హక్కులు హాట్ కేక్ లా అమ్ముడుపోయాయ్. ఇంతకీ నైజాం రైట్స్ సొంతం చేసుకుంది ఎవరో చెప్పనేలేదు కదూ... అగ్ర నిర్మాత దిల్ రాజు. త్రివిక్రమ్, పవర్ స్టార్ కలయికలో వచ్చిన సినిమాలు... జల్సా, అత్తారింటికి దారేది. రెండూ సినిమాలూ బ్లాక్ బస్టర్సే. అందుకే.. ఆ కాంబినేషన్ పై ఉన్న నమ్మకంతో 29 కోట్లకు నైజాం రైట్స్ ని కొనుగోలు చేశాడు దిల్ రాజు. ప్రస్తుతం పరిశ్రమలో ఇది చర్చనీయాంశమైంది. అంతేకాదు.. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కూడా అప్పుడే అమ్ముడుపోయాయ్. జెమినీ టీవీ... 19 కోట్ల యాభై లక్షలు వెచ్చించి ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని సొంతం చేసుకుంది. దీన్ని బట్టి ఈ సినిమా క్రేజ్ ఏ రేంజ్ లో ఉంది అర్థం చేసుకోవచ్చు. నైజాం, శాటిలైట్ మినహా... ఇంకా ఓ వంద కోట్లకు పైగానే ఈ సినిమా బిజినెస్ జరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల టాక్. హారిక క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేశ్, అను ఇమ్మానియేలు కథానాయికలు. అనిరుథ్ స్వరాలందింస్తున్నాడు.