ముంబాయ్లో డిసైడ్ చేసిన ప్రభాస్...!
on Jul 3, 2017
‘బాహుబలి’ తర్వత దేశం మొత్తం ప్రభాస్ తదుపరి సినిమాల గురించే మాట్లాడుకుంటోంది. ప్రభాస్ తదుపరి సినిమా ’సాహో‘ అని తెలిసిందే. మరి ’సాహో‘ తర్వాత ప్రభాస్ చేయబోయే సినిమా ఏంటి? దీనిపై ఇప్పటికే చాలా వార్తలొచ్చాయి. బాలీవుడ్ సినిమా చేస్తాడని కూడా ఓ వార్త హల్ చల్ చేసింది. అయితే... ’సాహో‘ తర్వాత తను చేసే సినిమాపై క్లారిటీ ఇచ్చేశాడు యంగ్ రెబల్ స్టార్. గోపీచంద్ తో ’జిల్‘ చిత్రాన్ని తెరకెక్కించిన రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేయనున్నారు. ’సాహో‘ తర్వాత తాను చేయబోయే సినిమా అదే అని ప్రభాస్ ముంబాయ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో చెప్పారు. వైరైటీ కథాంశంతో తరకెక్కనున్న ఈ చిత్రంలో ప్రభాస్ ఇంతకు ముందు కనిపించని రీతిలో కనిపిస్తాడట. ఈ సినిమా కథ బాగుందని ఇప్పటికే ఫిలింనగర్ టాక్.