బన్నీ నందమూరి హీరోని చూసి నేర్చుకోవాలి
on Jun 29, 2017
దువ్వాడ జగన్నాధం కలెక్షన్స్ కుమ్మేస్తుంది... బాహుబలి తర్వాత స్థానం ఈ సినిమాదే అని హీరో అల్లు అర్జున్, దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాత దిల్ రాజు చెప్పుకుంటున్నారు. కానీ వీటిలో వాస్తవమెంతో ఎవరికీ తెలియదు. డీజే కలెక్షన్స్ ఫేక్ అని, వాస్తవానికి పరిస్థితులు ఇంకోలా ఉన్నాయని కొందరు అంటున్నారు. ఓవర్సీస్ లో ట్రాకింగ్ ఉంది కాబట్టి అక్కడ ఫేక్ చేసే ఛాన్స్ లేదు. ఎన్నో డబ్బులు పెట్టి డీజే రైట్స్ కొన్న ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు పెట్టినదాంట్లో ఏ మాత్రం రాకపోవడంతో లబోదిబో మంటున్నారు. అయితే, అల్లు అర్జున్ డీజే టీం తో త్వరలో సినిమా ప్రమోషన్స్ కోసం అమెరికా వెళ్లనున్నాడు.
నిజానికి, నిర్మాతో, లేదా తానే స్వయంగా డబ్బులు పెట్టి ఈ టూర్ కి వెళ్లట్లేదు. ఇప్పటికే కష్టాల్లో ఉన్న ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు కూడా ఇంకాస్త రిస్క్ తీసుకునే ఆలోచనలో లేరు. మరి ఇంతకీ ఈ టూర్ కి స్పాన్సర్ చేస్తుంది ఎవరో తెలుసా- నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ వాళ్ళు... అదేనండి నాట్స్ సంస్థ నిర్వాహకులు. నాట్స్ అనేది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజషన్ అంటే వాళ్ళు తమ సొంత డబ్బులు పెట్టి నిర్వహిస్తున్న సంస్థ. అల్లు అర్జున్ మరియు డీజే టీం అమెరికా వచ్చి నాట్స్ ఈవెంట్ కి హాజరు కావాలంటే దారి ఖర్చులు, హోటల్ ఖర్చులు కలిపి 30 లక్షలు పెట్టుకోవాలని షరతు విధించారట. అల్లు అర్జున్ రేంజ్ కి 30 లక్షలు పెద్ద విషయం కాదు. పోనీ వీళ్ళు కేవలం నాట్స్ ఫంక్షన్ కే వస్తున్నారా అంటే అదీ కాదు. వాళ్ళ అసలు ఉద్దేశ్యం డీజే ని అక్కడ ప్రమోట్ చేయడం. అలాంటప్పుడు నాట్స్ నిర్వాహకులని ఇబ్బంది పెట్టడం ఎంత వరకు సబబు. ఈ విషయంలో అల్లు అర్జున్ అండ్ టీం నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నుండి నేర్చుకోవాలి. ఇంతకు ముందు నాట్స్ ఫంక్షన్ కి అటెండ్ అయిన కళ్యాణ్ రామ్ ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా తన సొంత డబ్బులు పెట్టుకొన్నాడు. మరి, బన్నీ ఇలా ఎందుకు చేస్తున్నాడు? తన సినిమాని కాపాడుకోవడం గురించి డబ్బులు పెట్టడంలో తప్పు లేదు కదా. మరి ఈ విషయంలో మీరేమంటారు?