బాహుబలి మ్యానియా..సెకనుకు 12 టికెట్లు బుక్
on May 3, 2017
ట్రంప్..సిరియా..అమెరికా..ఉత్తరకొరియా వీటి గురించే ఇప్పటి వరకు ప్రపంచం మాట్లాడుకుంది.. కానీ ఏప్రిల్ 28 తర్వాత మొత్తం సీన్ మారిపోయింది. కారణం ఆ రోజు దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి ద కన్క్లూజన్ ఆ రోజున రిలీజ్ కావడమే. ముఖ్యంగా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోవాలని జనం థియేటర్లకు పరుగులు తీశారు. ఇందుకు గాను వారం ముందే టిక్కెట్లు బుక్ చేశారు.
ఇప్పటికీ చాలా చోట్ల టిక్కెట్లు దొరకడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రిలీజ్ అయిన దగ్గర నుంచి అన్ని రకాల రికార్డులను బద్దలుకొడుతోంది బాహుబలి-2. లేటేస్ట్గా టిక్కెట్ల విషయంలోనూ కొత్త రికార్డు సృష్టించింది. ప్రముఖ ఆన్లైన్ టికెటింగ్ వెబ్సైట్ బుక్ మై షో తెలిపిన వివరాల ప్రకారం..ఆ సంస్థ ఇప్పటి వరకు దాదాపు 33 లక్షల టిక్కెట్లు అమ్మింది. ప్రతీ సెకనుకు 12 టికెట్లు బుక్ అవుతున్నాయని..బాహుబలి బిగినింగ్ కంటే రెండో పార్ట్కు 350 శాతం ఎక్కువగా అడ్వాన్స్ టికెట్ల అమ్మకాలు జరిగినట్లు ప్రకటించింది.
Also Read