మెగా మల్టీస్టారర్.. త్రివిక్రమ్ వల్లే సాధ్యమైయింది
on Feb 2, 2017
టాలీవుడ్ లో అదిరిపోయే కాంబినేషన్ సెట్ అయ్యింది. మామూలు కాంబినేషన్ కాదిది.. మైండ్ బ్లోయింగ్ కాంబినేషన్. మెగా అభిమానులు థ్రిల్ అయిపోయే కాంబినేషన్. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి, తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలయికలో ఓ భారీ మల్టీస్టారర్ కు రంగం సిద్ధమైపోయింది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు. ప్రముఖ నిర్మాత, ఎం.పి, కళా బంధు టి. సుబ్బిరామిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇటివలే మెగాస్టార్ రీఎంట్రీ చిత్రం 'ఖైదీ నెం 150' ఘన విజయం సాధించిన సందర్భంగా సుబ్బిరామిరెడ్డి చిరంజీవిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మెగాస్టార్, పవర్ స్టార్ తో సినిమా చేస్తానని ప్రకటించారు. `సరేలే.. పెద్దాయన ఇలానే చెబుతుంటాడు` అని అంతా లైట్ తీసుకొన్నారు. కానీ ఆ స్టేట్మెంట్ని కేవలం మాటలకే పరిమితం చేయలేదు. దీనిపై ఓ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు. మెగా ప్రొడ్యూసర్ అశ్వనీదత్ తో కలిసి ఈచిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నానట్లు ప్రకటించారు సుబ్బిరామిరెడ్డి.
నిజంగా ఇది వెరీ వెరీ సర్ప్రైజ్ కాంబినేషన్. మెగాస్టార్, పవర్ స్టార్ తో 'మెగామల్టీ స్టారర్' అని సుబ్బిరామి రెడ్డి ప్రకటించినప్పటికీ ఇందులో పవన్ కళ్యాణ్ ను తీసుకురావడం సాధ్యపడుతుందా ? అనే సందేహాలు వచ్చాయి. అయితే ఈ విషయంలో క్రిడెట్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఇవ్వాల్సిందేనని ఇన్నర్ సర్కిల్స్ లో వినిపిస్తుంది. ఈ కాంబినేషన్ ను సెట్ చేసింది త్రివిక్రమేనట. నిజంగా త్రివిక్రమ్ వల్లే ఇది సాధ్యమైయింది. త్రివిక్రమ్ చెప్పడం, ఆయన పై నమ్మకం వుంచిన పవన్ మరో మాటలేకుండా ఓకే చెప్పడం క్షణాల్లో జరిగిపోయింది. మొత్తంమ్మీద వెండితెరపై ఓ అద్భుతమైన, అరుదైన కాంబినేషన్ ను చూసే ఛాన్స్ అభిమానులు దక్కబోతుంది.