మంచు విష్ణుపై దేశద్రోహం కేసు..?
on Jan 27, 2017
దేశాన్ని విభజించాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రముఖ హీరో మంచు విష్ణుపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆయన తాజాగా నటించిన లక్కున్నోడు మూవీ ప్రమోషన్లో భాగంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉత్తరాది వారు దక్షిణాది వారిని చిన్నచూపు చూస్తున్నారని..దేశంలో దక్షిణాది ప్రజలు నిర్ణయిస్తేనే ఢిల్లీలో ప్రభుత్వాలు ఏర్పాటవుతున్నాయని..అయినా ఇక్కడి ప్రజలకు సరైన గుర్తింపు రావడం లేదని, అలాంటప్పుడు కలిసి ఉంటే లాభం లేదని..దేశాన్ని ఉత్తర, దక్షిణ భారతాల పేరిట రెండు దేశాలుగా విభజించాలని వ్యాఖ్యానించారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నరేంద్రమోడీ విచార్ మంచ్ విష్ణుపై వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది. భారతీయుడిగా అస్సలు బాధ్యత లేకుండా బాధ్యతారాహిత్యంతో మాట్లాడిన విష్ణు ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసింది.