శ్రీదేవి కూతురు అలా చేసిందా..?
on Jun 1, 2016
స్టార్స్ కు పిల్లలుగా పుడితే ప్లస్సులతో పాటు మైనస్సులు కూడా ఉంటాయి..కనీసం ఒక్క సినిమా కూడా చేయకుండానే ఫ్యామస్ అయిపోవడం ప్లస్ అయితే, ఎక్కడా ప్రైవసీ లభించకపోవడం మైనస్. మ్యాటర్ లోకి వెళ్తే, అన్నిభాషల్లోనూ ఎవర్ గ్రీన్ గా ప్రూవ్ చేసుకుంది శ్రీదేవి. ఆమెకు ఇద్దు కూతుళ్లు. పెద్దామ్మాయి జాన్వి కపూర్ కాగా, రెండో అమ్మాయి పేరు ఖుషీ కపూర్. పెద్దమ్మాయి ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్ కు కావాల్సిన అన్ని అర్హతలూ సాధించేసుకుంది. మంచి అందం, హీరోయిన్స్ ఇచ్చే స్టైలింగ్, పాపులారిటీ ఇవన్నీ కూడా ఈ కుర్రభామకు అప్పుడే అలవాటు అయిపోయాయి. లేటెస్ట్ గా సమ్మర్ వేకేషన్ కోసం ఫారిన్ వెళ్లిన జాన్వి, తిరిగి ఇండియా చేరుకుంది. ముంబై ఎయిర్ పోర్టులో మామూలుగానే సినీ సెలబ్రిటీలకు ఫోటోగ్రాఫర్ల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కాబోయే హీరోయిన్ కాబట్టి జాన్వీకి కూడా ఫోటోల సునామీ ఎదురైంది. అయితే ఈ అమ్మడు తన బాడీగార్డులకు చెప్పి, ఫోటోగ్రాఫర్లందరినీ పక్కకు గెంటించేసిందట. తనను కనీసం అడగను కూడా అడక్కుండా ఇలా ఫోటోలు తీయడమేంటి అని వాళ్లందరిపైనా మండిపడిందట. బాడీగార్డులు కూడా ఫోటోగ్రాఫర్లపై కాస్త ఓవర్ చేశారట. ఈ పాప హీరోయిన్ అవుతుందో లేదో ఎవరికీ తెలీదు కానీ, అప్పుడే కటింగ్స్ మాత్రం వీరలెవెల్లో ఇస్తోందంటూ గుసగుసలాడుతున్నారు బాలీవుడ్ జనాలు.