రాజేంద్రప్రసాద్ టాప్ ర్యాంకర్స్ పాటలు
on Nov 15, 2013
రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం "టాప్ ర్యాంకర్స్". ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. జి.నాగేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పసుపులేటి బ్రహ్మం నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జయసూర్య సంగీతాన్ని సమకూర్చారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ... "ప్రస్తుత విద్యావిధానం ఎలా ఉందో కళ్ళకు కట్టినట్లుగా చూపించారు దర్శకుడు. జయసూర్య మంచి వినసొంపైన సంగీతాన్ని అందించాడు. ఈ చిత్రం నా నట జీవితంలో గుర్తుండిపోయే కొన్ని సినిమాల జాబితాలలోకి చేరుతుంది" అని అన్నారు.