సైరా సెట్ కూల్చేసిన ప్రభుత్వం..!!
on Aug 1, 2018
స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సైరా నరసింహారెడ్డి సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తుండగా.. రామ్ చరణ్ నిర్మాతగా వ్యవరిస్తున్నారు.. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి.. చిత్ర యూనిట్ కూడా వీలైనంత త్వరగా సినిమాను పూర్తిచేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటుంది.. అయితే ఇప్పుడు సైరా టీంకి ఊహించని షాక్ తగిలింది.
ప్రభుత్వం సైరా సెట్ ని కూల్చేసింది.. రామ్ చరణ్ రీసెంట్ హిట్ రంగస్థలం కోసం.. ఆ చిత్ర నిర్మాతలు ఓ వ్యక్తి దగ్గర స్థలాన్ని లీజుకి తీసుకొని.. అక్కడ సెట్ వేసి షూటింగ్ పూర్తీ చేసారు.. అయితే అదే సెట్లో మార్పులు చేసి సైరా షూటింగ్ కి కూడా అదే సెట్ ఉపయోగించాలని భావించారు.. కానీ ఇక్కడే అనుకోని ట్విస్ట్ వచ్చింది.. నిజానికి ఆ స్థలం ప్రైవేట్ వ్యక్తిది కాదట.. ప్రభుత్వానిది.. దీంతో ఇది ప్రభుత్వానికి చెందిన భూమి అని రెవెన్యూ అధికారులు కోర్టులో పిటిషన్ వేశారు.. దీనికి సంబందించిన నోటీసులు రంగస్థలం చిత్ర సమయంలో వచ్చాయి.. కానీ అప్పుడు చిత్ర యూనిట్ స్పందించలేదు.. ఈ విషయాన్నీ సీరియస్ గా తీసుకున్న అధికారులు లేటుగా అయినా కాస్త కఠినంగా వ్యవహరించారు.. రంగస్థలం సెట్ ని నేలమట్టం చేసి ప్రభుత్వానికి సంబందించిన ఆదేశాలతో బోర్డు కూడా పాతేశారు.