'సైరా'పై ప్రశంసల జల్లు!
on Oct 7, 2019
ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ 'సైరా' జనాల ముందుకొచ్చింది. సినిమాకి వస్తున్న స్పందన పట్ల యూనిట్ సంబరాలు చేసుకుంటోంది. మరోవైపు ప్రముఖులు సైతం ట్విట్టర్ వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చిరంజీవి పన్నెండేళ్ల కలకు దృశ్య రూపమిస్తూ దర్శకుడు సురేందర్ రెడ్డి రూపొందించిన చిత్రం 'సైరా నరసింహా రెడ్డి'. భారీ బడ్జెట్ తో రామ్ చరణ్ నిర్మించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ మహాత్మా గాంధీ నూట యాభైవ జయంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'సైరా'కి సర్వత్రా మంచి స్పందన వస్తుండడంతో చిరు టీం సంబరాల్లో మునిగి తేలుతోంది. ఈ సందర్భంగా యూనిట్ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సైరాపై ట్విట్టర్ వేదికగా ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రకి చిరంజీవి జీవం పోశారని, దర్శకుడు సురేందర్ రెడ్డి, నిర్మాత రామ్ చరణ్ ఈ ఘన విజయానికి అర్హులు అని రాజమౌళి ట్వీట్ చేశారు. ఈరోజు చరిత్ర మళ్లీ పుట్టి, చిరంజీవి అయిందనీ దర్శకుడు హరీశ్ శంకర్ ట్వీట్ చేయగా నరసింహారెడ్డిగా చిరు తెరపై గర్జించారని యంగ్ టైగర్ అనిల్ రావిపూడి తెలిపారు. అలాగే నిర్మాత శోభు యార్లగడ్డ, దర్శకులు క్రిష్, వెంకీ అట్లూరి తదితరులు చిరుతో పాటు సైరా యూనిట్ ని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. జనగణ మనుషులను దోచుకుంటున్న సైరా ఎలాంటి రికార్డులకు కేంద్ర బిందువుగా నిలుస్తుందో చూడాలి.