వైఎస్సార్ 'యాత్ర' తో సుహాసిని రీఎంట్రీ
on Jun 14, 2018
వైస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి అందరికీ సుపరిచితమే.. అయితే ఇప్పుడు ఆమె పాత్ర వెండితెర మీద కనిపించబోతుంది.. ఆనందోబ్రహ్మ ఫేమ్ 'మహి వి రాఘవ్' దర్శకత్వంలో వైఎస్సార్ జీవితకథ ఆధారంగా 'యాత్ర' అనే సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాలో వైఎస్సార్ పాత్రలో మలయాళ సీనియర్ నటుడు మమ్ముట్టి నటిస్తున్నారు.. అలానే ఈ సినిమాలో సబితా ఇంద్రారెడ్డి పాత్ర కూడా ఉంటుందట.. ఈ పాత్ర కోసం సుహాసినిని సెలెక్ట్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.. ఈ మధ్య సినిమాలు తగ్గించిన సుహాసిని, సబితా రెడ్డి పాత్రతో రీఎంట్రీ ఇస్తారేమో చూడాలి.