శ్రీదేవి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కొత్త ట్విస్ట్
on Feb 26, 2018
శ్రీదేవి మృతిపై ఎన్నో అనుమానాలు... ఫామిలీ తో పెళ్ళికని వెళ్లిన బోనీ కపూర్ ముంబై ఎందుకు తిరిగి వచ్చాడు? శ్రీదేవి మరణించినపుడు బోనీ కపూర్ ఎక్కడ ఉన్నాడు? కుటుంబ సభ్యులంతా మీడియా ని ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు? పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడానికి 3 రోజుల సమయం ఎందుకు పట్టింది? అసలు శ్రీదేవి హార్ట్ ఎటాక్ తో చనిపోయిందా లేక మర్డరా? అంటూ మీడియా సంస్థలు పలు ప్రశ్నలు సంధించాయి. మొత్తానికి శ్రీదేవి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. దుబాయ్ అధికారులు డెత్ సర్టిఫికెట్ లో పేర్కొన్న వివరాలు కొత్త అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
ఇక వివరాల్లోకి వెళితే, శ్రీదేవి ఫంక్షన్ లో మద్యం సేవించి ప్రమాదవశాత్తూ బాత్ టబ్ లో పడి మృతి చెందిందని రిపోర్ట్ లో పేర్కొనబడింది. అభిమానుల్ని దృష్టిలో ఉంచుకొని పోస్ట్ మార్టం విషయంలో అతి జాగ్రత్త తీసుకోవడం వల్ల, పాస్ పోర్ట్ కాన్సల్ చేయడం... ఇత్యాది వ్యవహారాల కారణంగా రిపోర్ట్ రావడానికి ఆలస్యం జరిగిందని చెబుతున్నారు.
ప్రస్తుతం, దుబాయ్ పోలీసులు శ్రీదేవి కుటుంబ సభ్యులని ప్రశ్నిస్తున్నారు. అంతే కాకుండా శ్రీదేవి కాల్ డేటా ని కూడా చెక్ చేస్తున్నారు. ఇంకొద్ది సేపట్లో ప్రత్యేక విమానంలో శ్రీదేవి పార్థీవ దేహాన్ని ముంబై తరలించే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే, కోట్లాది అభిమానగణాన్ని సొంతం చేసుకున్న శ్రీదేవి మరణం అనుమానాస్పదం కావడంతో ఇండియా లో కూడా పలు కేసులు నమోదయ్యే అవకాశాలు లేకపోలేదు. ఈ కారణం వల్ల ఇక్కడ రీ పోస్ట్ మార్టం జరిగినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు. ఏది ఏమయినా అతిలోక సుందరి మరణం ఇన్ని అనుమానాలకు తావివ్వడం ఆమె అభిమానుల్ని కలచి వేస్తోంది. మున్ముందు మనం మరెన్ని ట్విస్టులు చూడాల్సి వస్తుందో...