మహేష్ బాబు స్పైడర్కి బయ్యర్లు కరువు
on Apr 22, 2017
బాహుబలి తర్వాత తెలుగు లో భారీ బడ్జెట్ సినిమా ఏదంటే మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న స్పైడర్ అని అందరూ ఠక్కున సమాధానం చెప్తారు. దాదాపు 90 - 100 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ సినిమా విడుదల పోస్ట్ ఫోన్ అయిందని వార్తలొస్తున్నాయి. రీ-షూట్ చేస్తున్నారని కొందరు చెబుతుండగా, అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాధం కూడా జూన్ 23 న వస్తుండడం స్పైడర్ విడుదల జాప్యానికి కారణం అని ఇంకొందరు అభిప్రాయం పడుతున్నారు. కానీ, కరెక్ట్ రీజన్ ఏంటంటే, స్పైడర్ కి బయ్యర్లు కరువవడమే. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు కాబట్టి, డిస్ట్రిబ్యూటర్లని నిర్మాతలు భారీ రేట్లు అడుగుతున్నారని తెలిసింది.
ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా అంత మొత్తం వెచ్చించడం రిస్క్ తో కూడుకున్న వ్యవహారం గనక, బయ్యర్లు అంత ఇంటరెస్ట్ చూపించడం లేదంట. దానికి తోడు, స్పైడర్ చాలా సీరియస్ మూవీ అని, కామెడీ పెద్దగా ఉండదని, మాస్ జనాలకి ఎక్కే అంశాలు ఉండవని వార్తలొస్తున్నాయి. తమిళ్ లో మహేష్ బాబు కి ఇది మొదటి స్ట్రెయిట్ సినిమా. కేవలం మురుగదాస్ పైన అంత డబ్బులు పెట్టేందుకు తమిళ బయ్యర్లు కూడా ఆసక్తి కనబరచడం లేదు. వీటన్నిటికి తోడు, స్పైడర్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం, మురుగదాస్ కి ఉన్న ఒకే ఒక్క అప్షన్ మంచి టీజర్ విడుదల చేసి మళ్ళీ సినిమా పైన ఇంటరెస్ట్ క్రియేట్ చేయడం. టీజర్ రిలీజ్ తర్వాత కూడా బయ్యర్లు ముందుకు రాకపోతే, నిర్మాతలు చాలా ఏరియాల్లో సొంతగా విడుదల చేయాల్సిన పరిస్థితి వస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో.