ప్రముఖ బాలీవుడ్ గాయకుడికి కరోనా
on Oct 16, 2020
దేశంలో రోజు రోజుకీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. పలువురు ప్రముఖులు వైరస్ మహమ్మారి బారిన పడుతున్నారు. అందులో చాలామంది కరోనాను జయించి ఆరోగ్యవంతులుగా ఆసుపత్రుల నుండి బయటకు అడుగు పెడుతున్నారు. కొందరు తిరిగిరాని లోకాలకు వెళుతున్నారు. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా వలన ఆసుపత్రికి వెళ్లారు. తరవాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. తాజాగా ప్రముఖ బాలీవుడ్ గాయకుడు కుమార్ సానుకి కరోనా సోకడంతో హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు.
తన భర్త కుమార్ సానుకి కరోనా అని సలోని స్వయంగా చెప్పారు. ప్రస్తుతం ఆమె లాస్ ఏంజిల్స్ లో ఉన్నారు. ఇద్దరు కుమార్తెలు కూడా అక్కడే ఉన్నారు. ఈ నెల 20న కుమార్ పుట్టినరోజు. అమెరికా వెళ్లి ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్నారు. ఈ సమయంలో కరోనా సోకడంతో ఆగిపోయారు. అన్నీ కుదిరితే నవంబర్ 8న అమెరికా వెళతారట. లేదంటే ఫ్యామిలీ ఇక్కడికి రావాలని ప్లాన్ చేసుకుంటోంది. కుమార్ సాను హోమ్ క్వారంటైన్ లో ఉంటే... ఆయన కుమారుడు జాన్ 'బిగ్ బాస్ 14'లో హౌస్ లో ఉన్నాడు.
Also Read