ఇద్దరు హీరోయిన్స్ తో బాలయ్య !!!
on Feb 8, 2019
`సింహా` ,`లెజెండ్` వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ , స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. గత చిత్రాల తరహాలోనే యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా ఏప్రిల్ నుంచి సెట్స్ పైకి వెళ్ళనుంది. యన్.బి.ఫిల్మ్స్ పతాకం పై బాలకృష్ణ స్వయంగా నిర్మించనున్న ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్నాడట బోయపాటి. ప్రజెంట్ ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రోడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో బాలయ్యకి జోడీగా ఇద్దరు క్రేజీ హీరోయిన్స్ నటించనున్నారని టాలీవుడ్ టాక్. వారిలో ఒకరిగా ఇప్పటికే కన్నడ బ్యూటీ శ్రద్దా శ్రీనాథ్ ఎంపికైందని వార్తలు రాగా , మరొకరిగా ఓ స్టార్ హీరోయిన్ నటించనుందని సమాచారం. త్వరలోనే కథానాయికలకు సంబంధించిన వివరాల పై ఫుల్ క్లారిటీ వస్తువది. 2020 సంక్రాంతికి బాలకృష్ణ,బోయపాటి హ్యాట్రిక్ మూవీ తెరపైకి రానుంది.