శంకర్ చేసిన మిస్టేక్ అదేనా!!!
on Dec 1, 2018
కొన్ని సార్లు ...కొన్ని ప్లస్ అనుకున్నవై మైనస్ లు అవుతుంటాయి. ప్రస్తుతం రజనీకాంత్ నటించిన `2.0` చిత్రం పరిస్థితి అలాగే ఉంది. సినిమా విడుదలై తొలి రోజు దాదాపు వంద కోట్లు రాబట్టింది. సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతోంది. అయితే మరి మైనస్ ఏంటి అనే కదా మీ డౌట్. అక్కడికే వస్తున్నా.... ప్రస్తుతం డిస్ట్రిబ్యూటర్స్ అంతా శంకర్ గారూ మీరే చేశారు అంటున్నారు. శంకర్ ఎంతో ఇష్టపడి చేసిన 3డి వెర్షన్ ఇప్పుడు ఈ చిత్రానికి శాపంగా మారింది. దాని వల్ల కలెక్షన్ల పరంగా మాత్రం చాలా వెనకపడి ఉంది. కారణం ఏంటంటే....శంకర్ అండ్ టీమ్ సినిమాను త్రీడీ వెర్షన్ లో చూస్తే అద్భుతమైన అనుభూతిని పొందుతారంటూ చెప్పుకొచ్చారు. దీంతో అందరూ త్రీడీ వైపు మొగ్గుచూపుతున్నారు తప్ప 2డి థియేటర్స్ వైపు చూసేవాళ్లు తక్కువయ్యారు. 2డి వెర్షన్ లో చాలా థియేటర్లలో సినిమా విడుదైలంది. దీంతో ఆ 2డి థియేటర్స్ అన్ని సగానికి పైగా ఖాళీగానే ఉంటున్నాయట. ఇక త్రీడీ వెర్షన్ ఉన్న థియేటర్స్ 500 కోట్లు రాబట్టాలంటూ కష్టమే అంటున్నారు. దీంతో శంకర్ మరోసారి పెద్ద మిస్టేక్ చేశాడంటున్నారు ట్రేడ్ పండితులు. చూడాలి మరి ఈ మిస్టేక్ ని ఎలా సరి చేసుకుంటాడో దర్శకుడు శంకర్.