క్రిటిక్స్ పై తేజ్ కామెంట్స్!!
on Feb 16, 2019
ప్రజంట్ సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. షూటింగ్ , పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్నీ తొందరలోనే కంప్లీట్ చేసి సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల తాను చేసిన సినిమాలు పరాజయం పాలవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజ్ క్రిటిక్స్ పై కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. తాను చేస్తున్న చిత్రలహరి సినిమా క్రిటిక్స్ అందరికీ సమాధానం చెబుతుందని అన్నాడు. ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా తండ్రీ-కొడుకుల మధ్య ఉండే రిలేషన్ ను చూపిస్తుందని , అంతేకాదు ప్రతి నిరుద్యోగికి ఈ సినిమా కనెక్ట్ అవుతుందని అన్నారు. కాగా ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన కళ్యాణి ప్రియదర్శన్ , నివేదా పేతురాజ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ , చెరుకూరి మోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. మరి సరైన విజయాలు లేక సతమతమవుతున్న తేజ్. ఈ సినిమా పై బాగానే హోప్స్ పెట్టుకున్నాడు.