వరుస చిత్రాలతో మెగా హీరో
on Aug 14, 2019
`చిత్రలహరి` చిత్రానికి ముందు వరుస ప్లాపులతో విసిగిపోయిన సాయితేజ్ `చిత్రలహరి ` సినిమా తో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు. ఇక ప్రెసెంట్ మారుతీ డైరెక్షన్ లో `ప్రతి రోజు పండగే ` చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే మరో రెండు సినిమాలకు గ్రీన్ ఇచ్చాడట సాయి తేజ్. అందులో ఒకటి ` వెంక టాద్రి ఎక్స్ ప్రెస్ ` ఎక్స్ ప్రెస్ రాజా `చిత్రాలతో దర్శకుడుగా మంచి పేరు తెచ్చుకున్న మేర్లపాక గాంధీ తో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడట . ఈ సినిమా యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మించనుందట. ఇక మరో సినిమా సుబ్బు అనే కొత్త కుర్రాడి డైరెక్షన్ లో చేయనున్నాడని సమాచారం అందుతోంది. ఈ చిత్రాన్ని బీవీయస్ ఎన్ ప్రసాద్ నిర్మించనున్నాడట. మేర్లపాక సినిమా ఈ ఏడాది చివరిలో ప్రారంభం కానుందట. ఇక సుబ్బు డైరెక్షన్ లో నెక్స్ట్ ఇయర్ చేయాలన్న ప్లాన్ లో ఉన్నాడట. గతం లో చేసినట్టు కాకుండా సెలెక్టెడ్ గా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు సాయి తేజ్.
Also Read