ఫ్లాష్ బ్యాక్ చెప్పనున్న రెజీనా
on Nov 25, 2020
అందం, అభినయాల మేలికలయిక.. రెజీనా. కెరీర్ ఆరంభం నుంచి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంటున్నప్పటికీ.. తన ప్రతిభకి తగ్గ స్థాయినైతే అందుకోలేకపోతోందీ టాలెంటెడ్ బ్యూటీ. ఆ మధ్య ఎవరు చిత్రంలో నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో కనిపించిన రెజీనా.. తాజాగా మరో పవర్ ఫుల్ రోల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. తమిళంలో రూపొందుతున్న ఆ సినిమానే ఫ్లాష్ బ్యాక్. ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి డాన్ శాండీ దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. ఇందులో ఇదివరకెన్నడూ కనిపించని పాత్రలో రెజీనా దర్శనమివ్వనుందట. మరి.. ఈ ఫ్లాష్ బ్యాక్ రెజీనా కెరీర్ కి ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.
కాగా.. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న ఆచార్యలో రెజీనా ప్రత్యేక గీతంలో నర్తించింది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ 2021 వేసవిలో థియేటర్స్ లో సందడి చేయనుంది.
Also Read