అఖిల్కి జోడీగా రష్మిక?
on Nov 20, 2020
అటు అగ్ర కథానాయకులతోనూ, ఇటు యువ కథానాయకులతోనూ సందడి చేస్తున్న నాయికల్లో రష్మిక మందన్న ఒకరు. ఈ ఏడాది ఆరంభంలో సరిలేరు నీకెవ్వరు, భీష్మ వంటి హిట్ చిత్రాలతో అలరించిన ఈ అమ్మడు.. ప్రస్తుతం పుష్ప, ఆడాళ్ళూ మీకు జోహార్లు సినిమాల్లో నటిస్తున్నారు. తాజాగా మరో తెలుగు మూవీకి ఈ కన్నడ కస్తూరి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.
ఆ వివరాల్లోకి వెళితే.. అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో అఖిల్ కి జోడీగా రష్మికను ఎంపికచేసిందట చిత్రబృందం. త్వరలోనే అఖిల్ 5లో రష్మిక ఎంట్రీపై క్లారిటీ రానుంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. తన మూడో తెలుగు చిత్రం దేవదాస్ లో అఖిల్ తండ్రి కింగ్ నాగార్జునతో కలసి నటించారు రష్మిక. అందులో నానికి జంటగా ఆమె దర్శనమిచ్చారు.