రంగస్థలం ఫోక్ సాంగ్ కుమ్మేసిందిగా...
on Mar 1, 2018
రామ్ చరణ్ రంగస్థలం ఈ నెల 30 న ప్రపంచవ్యాప్తంగా విడుదలకి సిద్ధం అవుతుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ అన్ని వర్గాల్ని అలరించగా, తరవాత విడుదలయిన ఫస్ట్ సాంగ్ ఎంత సక్కగున్నవే రికార్డుల మోత మోగించింది. చంద్రబోస్ రచనలో దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన ఈ పాట క్లాస్ ఆడియన్స్ ని మెప్పించింది. ఎన్నో రోజుల తర్వాత ఒక మంచి పాట విన్నాం అనే అభిప్రాయం వ్యక్త పరుస్తున్నారు సంగీత అభిమానులు. మిగతా పాటలు కూడా ఎలా ఉండబోతున్నాయో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రేపు రెండో పాట రంగా రంగా రంగస్థలాన విడుదల చేస్తాం అని ప్రకటించిన టీం, ఈ రోజు హోలీ సందర్భంగా ఆ సాంగ్ స్నీక్ పీక్ వీడియో రిలీజ్ చేసారు. సుకుమార్, చంద్రబోస్, దేవి ఎంత సక్కగున్నవే కి ఆడియన్స్ నుండి స్పందనకి కృతజ్ఞలు తెలుపుతూ సెకండ్ సాంగ్ ఎలా ఉండబోతుందో శాంపిల్ చూపించారు. ఫస్ట్ సాంగ్ ఫుల్ క్లాస్ అయితే, సెకండ్ సాంగ్ కంప్లీట్ మాస్. ఈ ఫోక్ సాంగ్ మెగాభిమానుల్ని అలరిస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. మొత్తానికి, దేవి రంగస్థలం తో తన విశ్వరూపం చూపిస్తున్నాడు.
Also Read