గోవాలో రానా హనీమూన్!
on Sep 21, 2020
దగ్గుబాటి వారసుడు, లాక్డౌన్లో మిహీకా బజాజ్తో ఏడడుగులు వేసిన వెర్సటైల్ యాక్టర్ రానా ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా? సౌతిండియాలోని రొమాంటిక్ హాలిడే స్పాట్ గోవాలో ఉన్నాటడ. హనీమూన్ ట్రిప్ వేశాడని టాక్. సాధారణంగా సెలబ్రిటీలు వివాహమైన తరవాత యూరప్ కంట్రీస్కి హనీమూన్కి వెళతారు. కానీ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా విదేశాలకు వెళ్లడం రిస్క్తో కూడుకున్న వ్యవహారమే. అందుకని, రానా కూడా ఫారిన్కి వెళ్లకుండా హైదరాబాద్కి దగ్గరలో ఉన్న గోవా వెళ్లాడట.
హనీమూన్ ట్రిప్లోనూ ప్రొఫెషనల్ పనులు చక్కబెట్టడం రానా ఆపలేదు. గోవా నుండే యానిమేషన్ కామెడీ షో ‘వై ఆర్ యు’ అనౌన్స్ చేశాడు. హీరో కాకముందు రానా వీఎఫ్ఎక్స్, యానిమేషన్, డీఐ రంగంలో కొన్నాళ్లు పని చేశాడు. అప్పట్లో ఓ కంపెనీ కూడా రన్ చేశాడు. ఇప్పటికీ ఆ కంపెనీ ఉన్నట్టుంది. లాక్డౌన్లో కొత్తగా ఏం చేయాలని ఆలోచించి, యానిమేషన్ షోకి ప్లాన్ చేశాడు. త్వరలో ఈ షో స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నాడట.
రూమ్ నుండి కదలకుండా ఈ యానిమేషన్ షో చేయవచ్చట. యానిమేషన్ క్రియేటర్లు విజువల్ క్రియేట్ చేస్తారు. దానికి రానా డబ్బింగ్ చెప్తే చాలు. ఈ షో కాన్సెప్ట్, ఇతర వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. ప్రస్తుతానికి ఎలా ఉంటుందనేది చూపించడానికి అన్నట్టు టీజర్ విడుదల చేశారు.
Also Read