రమ్యకృష్ణ.. రెండు వారాల్లో రెండు విభిన్న పాత్రలు
on Apr 3, 2021
దక్షిణాదిన తిరుగులేని కథానాయికగా రాణించారు రమ్యకృష్ణ. హీరోయిన్ గా స్టార్ డమ్ చూసిన ఈ అభినేత్రి.. గత కొంతకాలంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన ముద్ర వేస్తున్నారు. ముఖ్యంగా `బాహుబలి` సిరీస్ లో చేసిన శివగామి పాత్ర జాతీయ స్థాయిలో ఆమెకి ప్రత్యేక గుర్తింపుని తీసుకువచ్చింది. ఎన్నో అవకాశాలకు చిరునామాగా నిలిచింది. ప్రస్తుతం ఈ సీనియర్ యాక్ట్రస్.. పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
కాగా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన రెండు విభిన్న చిత్రాలు జూన్ నెలలో సందడి చేయనున్నాయి. ఆ చిత్రాలే.. `రిపబ్లిక్`, `రొమాంటిక్`. `సుప్రీమ్` హీరో సాయితేజ్ కథానాయకుడిగా నటించిన `రిపబ్లిక్`లో విశాఖ వాణి పాత్రలో కనిపించనున్నారు రమ్యకృష్ణ. `తప్పూ ఒప్పులు లేవు, అధికారం మాత్రమే శాశ్వతం` అనే దృష్టి కోణంలో ఈ క్యారెక్టర్ సాగుతుంది. జూన్ 4న `రిపబ్లిక్` రిలీజ్ కానుంది.
ఇక పూరీ ఆకాశ్, కేతికా శర్మ జంటగా నటిస్తున్న `రొమాంటిక్`లో కథానాయకుడి తల్లి పాత్రలో దర్శనమివ్వనున్నారు రమ్య. జూన్ 18న ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ విడుదల కానుంది. మరి.. రెండు వారాల వ్యవధిలో రెండు విభిన్న పాత్రలతో పలకరించనున్న రమ్యకృష్ణ.. ఆయా చిత్రాలతో ఎలాంటి గుర్తింపుని తెచ్చుకుంటారో చూడాలి.