పంథా మార్చుకోకపోతే.. అంతే సంగతులు!
on Dec 2, 2017
తొలి ప్రయత్నంలో కొత్తగా ఆలోచిస్తారు. అది హిట్ అవుతుంది. ఇక అక్కడ్నుంచి చేసే ప్రతి సినిమాకూ ఆ తొలి సినిమా తరహా కథల్నే తయారు చేసి మూస ధోరణిలో వెళ్లిపోతుంటారు. చివరకు జనాలకు విసుగు లేస్తుంది. సినిమాను తిప్పి కొడతారు. అంతే... ఉన్నట్టుండి స్లమ్ లోకి వెళ్లిపోతారు. ఇది ఇప్పటి దర్శకుల తీరు. చాలామంది దర్శకులు ఈ విధంగా జనం చేతిలో బలైపోయిన వారే. ప్రస్తుతం ఓ యువ దర్శకుడు ఇదే తరహాలో ప్రయాణిస్తున్నాడు. తన పంథా మార్చుకోకపోతే... ఆ దర్శకునికే కాదు. ఎవరికైనా ఎదురు దెబ్బలు తప్పవ్. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు? అనేగా మీ డౌట్. అతని పేరు నక్కిన త్రినాథరావు. ఇప్పటివరకూ ఓ నాలుగు సినిమాలు తీశాడు. అందులో ఒకటి మినహాయిస్తే... మిగిలిన మూడూ సూపర్ హిట్లే. అయితే.. తన మూడో సినిమా ‘సినిమా చూపిస్తా మావా’ అని కెరీర్ లో పెద్ద హిట్.
అందుకే... ఆ తర్వాత కూడా అదే మామా అల్లుళ్ల వార్ ఫార్ములాతో ‘నేను లోకల్’ కథ తయారు చేసుకున్నాడు. అది కూడా పెద్ద హిట్ అయ్యి కూర్చుంది. ఎప్పుడైతే.. రెండో సినిమాకు కూడా అదే ఫార్ములా వర్కవుట్ అయ్యిందో... ఇప్పుడు మూడో సినిమా కూడా అదే ఫార్ములాతో తీయడానికి మనోడు తెగబడుతున్నాడు. దీనికి దిల్ రాజు నిర్మాత. ఈ దర్శకుడి ధైర్యం అదే. ఈ దఫా హీరో ఎవరో చెప్పనేలేదు కదూ.. హీరో రామ్ ఇందులో హీరోగా నటిస్తాడు. ఇందులో మామగా ప్రకాశ్ రాజ్ చేస్తాడట. జనాలకు విసుగు రానంతవరకూ ఇలా చేస్తే ఫర్వాలేదు. విరక్తి పుట్టేదాకా చేస్తే... బ్యాడ్ పిరియడ్ గ్యారెంటీ. అందుకే... దర్శకుడు గారూ... మారండీ. లేదా... జనాలు సినిమా చూపిస్తారు.