రంగస్థలంపై రామ్ చరణ్ షాకింగ్ డెసిషన్...
on Feb 6, 2018
స్టార్ హీరోల సినిమాలు హిట్ అయితే లాభాలు ఏ రేంజ్లో ఉంటాయో ఎవరికి చెప్పనవసరం లేదు. అదే స్టార్ హీరోల సినిమాలు ఫ్లాప్ అయినా పరిస్థితి అదే రేంజ్ లో ఉంటుంది. చాలా ఘోరంగా నష్టపోయే సందర్భాలు చూస్తూనే ఉన్నాం. ఏదైనా.. లాభమైనా.. నష్టమైనా... స్టార్ హీరోలకు ఉండే బిజినెస్ లో మాత్రం మార్పులు ఉండవు. వారి సినిమాలకు అదే రేంజ్ లో బిజినెస్ జరుగుతూ ఉంటుంది. హిట్ అయితే ఓకే... అదే కొంచెం తేడా కొట్టినా.. నష్ట పరిహారంగా ఎంతోకొంత ఇవ్వమంటూ దర్శక నిర్మాతలను .. హీరోలను ఇబ్బందిపెట్టే సంఘటనలు జరుగుతుంటాయి. అందుకే ఇప్పుడు రామ్ చరణ్ తేజ్ ఓ డెసిషన్ తీసుకున్నాడట. మార్కెట్ లో వున్న హైప్ ఆధారంగా .. అభిమానుల్లో వున్న క్రేజ్ కారణంగా ఎక్కువ ధరకు తన సినిమా ఏరియా హక్కులను నిర్ణయించడం చేయవద్దని నిర్మాతలకు చెప్పాడట. ఎవరికీ నష్టం కలగని విధంగా 20 శాతం తక్కువకే తన సినిమాపై హక్కులు ఇచ్చేయమని.. అయితే ఏయే ఏరియాలలో ఎవరికి ఎంతకి అమ్మారనే వివరాలను డీల్ క్లోజ్ చేయడానికి ముందుగా తనకి చెప్పాలని చెప్పారట. మొత్తానికి రామ్ చరణ్ ఇలాంటి తలనొప్పులు నాకెందుకులే అని అనుకున్నాడేమో.. ఈ నిర్ణయం తీసుకున్నాడు.
కాగా ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ఇటీవల రిలీజై మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా రామ్ చరణ్ యాక్టింగ్ కు మంచి మార్కులే పడ్డాయి. ఇక ఈసినిమా మార్చి 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.