తమిళ రీమేక్ లో రాజశేఖర్
on Apr 17, 2014
తమిళంలో విజయ్ సేతుపతి, సంచితాశెట్టి, ఆశోక్ సెల్వన్ లు ప్రధానపాత్రల్లో నటించిన "సూదు కవుమ్" అనే చిత్రం ఇటీవలే విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నారు. ఈ చిత్ర తెలుగు రీమేక్ హక్కులను పివిపి బ్యానర్ సొంతం చేసుకుందని తెలిసింది. అయితే ఇందులోని ఓ ప్రధాన పాత్రలో హీరో రాజశేఖర్ చేయనున్నాడట. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. రాజశేఖర్ ప్రస్తుతం రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న "పట్టపగలు" చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత తమిళ రీమేక్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.