ఏప్రిల్ 17న రేసుగుర్రం సక్సెస్ మీట్
on Apr 16, 2014
అల్లు అర్జున్, శృతిహాసన్ జంటగా నటించిన "రేసుగుర్రం" ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని దక్కించుకుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ, రికార్డులను బ్రేక్ చేస్తుంది. అయితే ఈ సక్సెస్ ను ప్రేక్షకులతో పంచుకోవడానికి ఓ భారీ సక్సెస్ మీట్ ను ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్ 17న ఈ కార్యక్రమం జరగనుందని తెలిసింది. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు, హీరో హీరోయిన్లు, సంగీత దర్శకుడు, నిర్మాతలతో పాటుగా మరికొంతమంది ముఖ్య తారాగణం పాల్గొననుంది. త్వరలోనే ఈ చిత్రాన్ని మలయాళంలో కూడా విడుదల చేయనున్నారు.