'రభస' యంగ్ టైగర్ ఎంట్రీ ఇచ్చాడు
on Aug 1, 2014
రభస ఆడియో ఫంక్షన్ లోకి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు. ఎన్టీఆర్ వచ్చిన వెంటనే హీరోయిన్లు సమంత, ప్రణీత కూడా వచ్చారు. యంగ్ టైగర్ ఎంట్రీతో ఫ్యాన్స్ అంతా ఎన్టీఆర్, ఎన్టీఆర్ అంటూ 'రభస' 'రభస' చేశారు. ఈ ఫంక్షన్ కి వి.వి. వినాయక్, దిల్ రాజు, బండ్ల గణేష్ పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. దిల్ రాజు మాట్లాడుతూ..ఆది, బృందావనం కలిపితే రభస అని, ప్రతి సినిమాలో ఎన్టీఆర్ ఏదోకటి కొత్తదనంగా చేయాలని చూస్తారని చెప్పారు. మూడో సాంగ్ ను ఆయన రిలీజ్ చేశారు.