ఆది సినిమాతో మనోజ్ హ్యాపీ
on Apr 16, 2014
ఆది, శాన్వి జంటగా నటిస్తున్న తాజా చిత్రం "ప్యార్ మే పడిపోయానే". రవి చావలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కె.కె.రాధామోహన్ నిర్మాత. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఇటీవలే హైదరాబాదులో జరిగింది. తొలి సిడీని మంచు మనోజ్ ఆవిష్కరించారు. సాయికుమార్ స్వీకరించారు. ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ... "నా పాట ఈ సినిమాకు టైటిల్ అవడం ఎంతో ఆనందాన్నిచ్చింది. ఇందులో ఆది నటిస్తున్నాడని తెలిసి ఇంకా ఆనందం కలిగింది. ఆది డాన్స్, అనూప్ పాటలు చాలా బాగున్నాయి" అని అన్నారు. ఆది మాట్లాడుతూ..."ప్రేమకథలకు సంగీతమే ప్రాణం. ఈ సినిమా ఫలితంలో సగభాగం అనూప్ రూబెన్స్ కే చెందుతుంది. నిర్మాత రాధామోహన్ ఎక్కడ రాజీపడకుండా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. ఇది అందరికి నచ్చుతుంది" అని అన్నారు. ఈ కార్యక్రమానికి నాని, కె.అచ్చిరెడ్డి, సందీప్ కిషన్, చైతన్య కృష్ణ, నవదీప్, రకూల్ ప్రీత్ సింగ్. ఎరికా ఫెర్నాండేజ్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.