సింధు స్క్రీన్ పై మెరవనుందా!!!
on Oct 2, 2018
ప్రజంట్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా బయెపిక్ ల హవా నడుస్తోంది. పొలిటీషియన్స్, సినీ తారలు, క్రీడాకారుల లైఫ్ హిస్టరీ ఆధారంగా బయోపిక్ లు తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే క్రీడాకారులపై ఎమ్ఎస్ ధోని, సచిన్, మిల్కాసింగ్, లైఫ్ హిస్టరీ ఆధారంగా బాలీవుడ్ లో చిత్రాలు రూపొందాయి. అయితే తాజాగా తెలుగులో ఒక క్రీడాకారిణి బయోపిక్ వస్తోన్నట్లు ప్రస్తుతం వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఒకసారి వివారల్లోకి వెళితే... అతి తక్కువ కాలంలో ప్రముఖ బాడ్మింటన్ గా పేరు తెచ్చుకున్న పి.వి.సింధు బయోపిక్ రానుందట. దీన్ని సోనూసూద్ తెరకెక్కించబోతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి.
కాగా తాజాగా ఈ చిత్రం స్క్రిప్ట్ లో భాగంగా ఇటీవల హైదరాబాద్ వచ్చిన సోన్ సూద్, సింధుతో పాటు ఆమె తల్లితండ్రులను కూడా కలిసి స్క్రిప్ట్ గురించి డిస్కస్ చేశారట. ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో సోనూ మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ పాత్రలో నటించనున్నారు. అలాగే ఈ సినిమాకు నిర్మాతగానూ వ్యవహరించనున్నారు.