‘వాస్కోడిగామా’గా పూరి తనయుడు!!
on Nov 27, 2018
పూరి తనయుడుతో `మెహబూబా` చిత్రం చేసిన సంగతి తెలిసిందే. కానీ ఆ సినిమా ఆశించినంతగా ఆడలేదు. ఆకాష్ తో పూరి మరో సినిమా చేయబోతున్నాడు. అయితే దర్శకుడుగా కాదు నిర్మాతగా. కథ కూడా పూరినే అందిస్తున్నాడు. దర్శకత్వ బాధ్యతలు మాత్రం తన శిష్యుల్లో ఒకరైన అనిల్ పడూరికి అప్పజెబుతున్నాడట. ఈ సినిమాకు `వాస్కోడిగామా` అనే టైటిల్ ని కన్ ఫర్మ్ చేసారట. ఇప్పటికే ఈ టైటిల్ ఫిలించాంబర్ లో కూడా రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది.
గతంలో పూరి తమ్ముడు సాయి రామ్ శంకర్ కి వరుసగా ఫ్లాపులు పడుతుంటే కథ అందించాడు పూరి. అదే `బంపర్ ఆఫర్` ఆ సినిమా మంచి సక్సెస్ గా నిలిచింది. ఇప్పడు అదే విధంగా తనయుడి విషయంలో రిపీట్ అవుతుందన్న ఆశాభావంతో ఉన్నాడట పూరి జగన్నాథ్. ఈ సినిమా ద్వారా గాయత్రి భరద్వాజ్ అనే కొత్త అమ్మాయిని హీరోయిన్ గా పరిచయం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ కి కూడా పెద్దగా ఆఫర్స్ ఏమీ లేదు. మరి ఇలాంటి టైమ్ తనయుడు ఆకాష్ కి కూడా ఈ సినిమా చాలా కీలకమే అని చెప్పాలి.