అడిగేవాడు వస్తున్నాడు
on Apr 19, 2014
అసలే ఎండాకాలం. ఈ ఎండలతో పాటు రాష్ట్రంలో ఎన్నికల వేడి ఎక్కువయ్యింది. ఈ తరుణంలో రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను అరికట్టడానికి "ప్రతినిధి" వచ్చేస్తున్నాడు. నారా రోహిత్ హీరోగా ప్రశాంత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం "ప్రతినిధి". రాష్ట్రంలో జరిగే అన్యాయాలను, అక్రమాలను చూపించే ఈ చిత్రం సరైన సమయంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఎన్నికల్లో ఎలాంటి వారిని ఎన్నుకోవాలి? ఎలాంటి వాళ్ళు ప్రజలకు సేవా చేస్తారో వాళ్లనే ఓటు వేసి గెలిపిద్దాం.. అనే విధంగా ఆలోచింపజేసే కమర్షియల్ చిత్రం ఇది. శుభ్ర అయ్యప్ప హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందించాడు. ఇటివలే విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తుంది. ట్రైలర్ లు చూస్తుంటే సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అనే ఉత్కంట పెరిపోతుంది. అయితే ఈ చిత్రాన్ని ఈనెల 25న విడుదల చేస్తున్నారు. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు చిత్ర యూనిట్ సభ్యులు.