'సలార్' తరువాత తారక్ తోనే..
on Jan 27, 2021
రెండో సినిమాతోనే పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయారు ప్రశాంత్ నీల్. 'కేజీఎఫ్' కెప్టెన్ గా నేషనల్ వైడ్ పాపులారిటీ పొందారు. త్వరలో 'కేజీఎఫ్ ఛాప్టర్ 2'తో పలకరించనున్న ప్రశాంత్.. ఆ తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో 'సలార్' తో సందడి చేయనున్నారు. పాన్ ఇండియా మూవీగానే ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆ తరువాత కూడా అదే శైలిని కొనసాగించబోతున్నారట. చాన్నాళ్ళుగా వార్తల్లో ఉన్న కాంబినేషన్ తోనే తన ఐదో చిత్రం చేయబోతున్నారట ప్రశాంత్.
ఆ కాంబినేషన్ మరెవరితోనే కాదు.. యంగ్ టైగర్ యన్టీఆర్ తో. 'ఆర్ ఆర్ ఆర్', యన్టీఆర్ 30 తరువాత తారక్ చేయబోయే ప్రాజెక్ట్.. ప్రశాంత్ తోనే ఉంటుందట. హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమా.. ఈ ఏడాది చివరలోగానీ వచ్చే ఏడాది ఆరంభంలోగానీ పట్టాలెక్కే అవకాశాలున్నాయని టాక్. త్వరలోనే తారక్, ప్రశాంత్ కాంబో మూవీపై మరింత క్లారిటీ రావచ్చు.