మన్మథుడితో ఆర్ ఎక్స్ పాప!!
on Feb 1, 2019
`ఆర్ ఎక్స్ 100` తో సెన్సేషన్ క్రియేట్ చేసి, కుర్రాళ్లను పాగల్ గాళ్ళను చేసింది పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమాలోనే నటనకు అవకాశమున్న పాత్రలో కనిపించి మెప్పించిన ఈ ఉత్తరాది సోయగం...ప్రజంట్ మాస్ మహరాజ్ రవితేజకు జోడీగా `డిస్కోరాజా` చిత్రంలో నటిస్తోంది. అలాగే మరో క్రేజీ ప్రాజెక్ట్ లో నూ హీరోయిన్ గా నటించే అవకాశం అందుకుందని టాలీవుడ్ లో వార్తలు వినపడతున్నాయి. ఒక సారి ఆ విషయాల్లోకి వెళితే...2002 లో త్రివిక్రమ్ దర్శకత్వంలో కింగ్ నాగార్జున నటించిన `మన్మథుడు` చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సీక్వెల్ ని `చిలసౌ` ఫేమ్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున నటిస్తున్న సంగతి కూడా తెలిసిందే. అయితే ఈ సినిమాలో నాగార్జున సరసన పాయల్ రాజ్ పుత్ ని తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలు ఉండబోతున్నట్టు సమాచారం. మార్చిలో షూటింగ్ ప్రారంభించి అగస్ట్ లో రిలీజ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు నాగార్జున. దాదాపు 60 రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ పోర్చుగల్ లో జరగనుందని తెలుస్తోంది. త్వరలో పాయల్ రాజ్ పుత్ కి సంబంధించిన వార్త అధికారికంగా వెలువడే అవకాశాలున్నాయట.