‘జేజమ్మ’ సీక్వెల్లో RX100 బ్యూటీ
on Jun 21, 2019
అనుష్క లో దాగి ఉన్న అధ్భుతమైన నటిని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన సినిమా `అరుంధతి`. ఆ తర్వాత అనుష్క చాలా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి మెప్పించింది. ఇంకా మెప్పిస్తోంది. అయితే `ఆర్ ఎక్స్ 100` సినిమాలో బోల్డ్ గా నటించి కుర్రాళ్ల గుండెలను క్లీన్ బౌల్డ్ చేసిన పాయల్ రాజ్ పుత్ `అరుంధతి-2` చిత్రంలో ప్రధాన పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శ్రీ శంఖుచక్ర ఫిలింస్ పతాకంపై కోటి తూముల ఈ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. చారిత్రాత్మక నేపథ్యంతో కూడిన కథాంశంతో భారీ బడ్జెట్ తో , భారీ గ్రాఫికల్ చిత్రంగా రూపొందనుందనీ, ఈ చిత్రంలో పాయల్ రాజ్ పుత్ తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ కి చెందిన ప్రముఖ తారలు నటిస్తున్నారనీ ఈ రోజు నిర్మాత అధికారికంగా ప్రకటించారు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ విజువైలైజేషన్ గ్రాఫికల్ వర్క్స్ హాలీవుడ్ సాంకేతిక నిపుణుల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. కథాంశంలో భాగంగా హీరోయిన్ రాజ్ పుత్ , గుర్రపుస్వారీ, కత్తి సాములకు సంబంధించిన శిక్షణ హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ వద్ద తీసుకుంటోంది. అతి త్వరలో షూటింగ్ ప్రారంభించబోయే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే అరుంధతి సినిమాకు ఇది సీక్వెల్ గా వస్తోందా? లేక టైటిల్ మాత్రమే తీసుకొని మరో కొత్త కథతో వస్తున్నారా? అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.