భయపడుతున్న పాయల్ ఘోష్ తండ్రి
on Sep 22, 2020
బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనను లైంగికంగా వేధించాడనీ, తనను దగ్గరకు తీసుకోబోయాడనీ, సుమారు 200 మంది మహిళలతో లైంగిక సుఖం అనుభవించానని తనతో చెప్పాడని నటి పాయల్ ఘోష్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, అనురాగ్ కశ్యప్కి మద్దతుగా అతడి మాజీ భార్యలు ఆర్తీ బజాజ్, కల్కి కొచ్చిన సహా అతడి సినిమాల్లో నటించిన రాధికా ఆప్టే వంటి నాయికలు మాట్లాడారు.
అనురాగ్కి మద్దతుగా మాట్లాడుతున్న వాళ్లందరికీ తాను చెబుతున్నది నిజమని తెలుసునని పాయల్ ఘోష్ అన్నారు. అలాగే, అతడికి మద్దతుగా వాళ్లంతా మాట్లాడతారని తనకు ముందే తెలుసు అని ఆమె వ్యాఖ్యానించారు. తనకు మద్దతుగా మాట్లాడటం వలన వాళ్లకు అవకాశాలు రావనీ, పని దొరకదనీ... అదే అనురాగ్కి మద్దతుగా మాట్లాడితే అతడు అవకాశాలు ఇస్తాడని వాళ్ల పాన్ అని పాయల్ పేర్కొన్నారు. హిందీ సినిమా ఇండస్ట్రీలో అనురాగ్ పవర్ఫుల్ పర్సన్ అన్నారు. తన స్నేహితులలో కొందరు తనకు మద్దతుగా మాట్లాడడానికి భయపడుతున్నారనీ, ఒకవేళ మాట్లాడితే ఎక్కడ అవకాశాలు కోల్పోతామో అని ఆలోచిస్తున్నారని పాయల్ తెలిపారు.
అనురాగ్ కశ్యప్ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తానని పాయల్ ఘోష్ వెల్లడించారు. అలాగే, సెక్యూరిటీ కోరతానని చెప్పారు. తాజా పరిణామాలతో తన తండ్రి భయపడుతున్నారనీ, తనను హైదరాబాద్ వెళ్లిపొమ్మని అడుగుతున్నారని ఆమె అన్నారు. తానెందుకు తన ఇల్లు వదలాలని ఆమె పాయల్ ప్రశ్నిస్తున్నారు. ముంబైలో ఉండి న్యాయ పోరాటం చేస్తానని అన్నారు.