పవన్ - రానా మల్టిస్టారర్.. రిలీజ్ డేట్ ఫిక్సయిందా?
on Jan 27, 2021
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి స్టార్ రానా కాంబినేషన్ లో ఓ మల్టిస్టారర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మాలీవుడ్ బ్లాక్ బస్టర్ అయ్యప్పనుమ్ కోషియుమ్ ఆధారంగా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తుండగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ సమకూర్చుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా తాలూకు షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.
ఇదిలా ఉంటే.. ఈ మల్టిస్టారర్ ని ఈ ఏడాది ఇండిపెండెన్స్ వీకెండ్ లో రిలీజ్ చేయడానికి యూనిట్ ప్లాన్ చేస్తోందట. అదే గనుక నిజమైతే.. తక్కువ గ్యాప్ లోనే పవన్ నుంచి రెండు సినిమాలు రాబోతున్నట్టే. వేసవిలో పవన్ రి-ఎంట్రీ మూవీ వకీల్ సాబ్ విడుదల కాబోతుండగా.. ఆగస్టులో ఈ మల్టిస్టారర్ సందడి చేయనుంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఈ రెండు సినిమాలకు కూడా యువ సంగీత సంచలనం తమన్ నే బాణీలు అందిస్తున్నారు. త్వరలోనే ఈ రెండు చిత్రాల విడుదల తేదీలపై స్పష్టత వచ్చే అవకాశముంది.
Also Read