పవన్ సారూ.. ఈ న్యూస్ నిజమేనా..?
on Dec 4, 2017
సూపర్స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి చిత్రానికి ప్రమోషన్ ఏ రేంజ్లో చేశారో ప్రపంచం కళ్లు అప్పగించి చూసింది. కార్స్, సిమ్స్, వెండి నాణేలు ఇలా ఒకటేంటి ఎలా కుదిరితే అలా బ్రాండింగ్ చేశారు. చివరకు కార్పోరేట్ దిగ్గజాలు కూడా కబాలి క్రేజ్ను క్యాష్ చేసుకుని వారి అమ్మకాలను పెంచుకునేందుకు ఎగబడ్డాయి. ఈ ప్రమోషన్ కారణంగానే సినిమా ఫ్లాపైనా భారీ స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది కబాలి. ఇప్పుడు ఇదే ఫార్ములాను ఫాలో అవ్వాలనుకుంటున్నాడు త్రివిక్రమ్. ఆయన దర్శకత్వంలో పవర్స్టార్ పవన్కళ్యాణ్ నటిస్తున్న అజ్ఞాతవాసి పబ్లిసిటీ కబాలి స్థాయిలో జరుగుతుందని టాలీవుడ్ టాక్.
ఫిలింనగర్ వర్గాల సమచారం ప్రకారం హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే రెండు విమానాలను అజ్ఞాతవాసి ఫోటోలతో బ్రాండింగ్ చేయనున్నారట. అలాగే రీసెంట్గా హైదరాబాద్లో ప్రారంభమైన మెట్రోను కూడా ఇందుకు ఉపయోగించనున్నారట. ఆడియో ఈవెంట్ కూడా గ్రాండ్గా నిర్వహించేందుకు అనేక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు పోటీ పడుతుండటంతో.. ఈ ఫంక్షన్కు ఎవరు ఎలాంటి ఆఫర్లు ఇస్తారో తెలుపుతూ టెండర్లు వేయమని నిర్మాతలు కోరుతున్నారట. ఇప్పటికే సినిమా కోసం ఎంతో ఎగ్జయిట్మెంట్తో ఎదురుచూస్తున్న పవన్ అభిమానుల్లో ఈ బ్రాండింగ్ న్యూస్ జోష్ తీసుకువచ్చిందట. అయితే ఈ వార్తలు కేవలం పుకార్లా లేకపోతే నిజంగానే ఆ రేంజ్లో ప్రమోషన్లు ప్లాన్ చేశారో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.