అజ్ఞాతవాసికి ఆడియో లాంఛ్ ఉన్నట్టా..? లేనట్లా..?
on Nov 30, 2017
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న అజ్ఞాతవాసి ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రీ లుక్ పోస్టర్తో అంచనాలు ఓ రేంజ్లో ఉండటంతోఅత్యంత భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోందట. ఫిలింనగర్ వర్గాలలో వినబడుతున్న వార్తల ప్రకారం సుమారు 150 కోట్ల బిజినెస్ జరగవచ్చని అంచనా. రిలీజ్ డేట్ దగ్గరపడుతోండటంతో ఆడియో ఎప్పుడు బయటకు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. త్రివిక్రమ్-పవన్ కాంభినేషన్లో వచ్చిన గత సినిమాల్లోని పాటలు ఒక ఊపు ఊపాయి.
అజ్ఞాతవాసికి కోలీవుడ్ రాక్స్టార్ అనిరుధ్ సంగీతాన్ని అందజేస్తున్నాడు.. ఈ సంగతి పక్కనబెడితే అసలు అజ్ఞాతవాసికి ఆడియో లాంఛ్ కార్యక్రమం ఉందా..? లేదా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. డిసెంబర్ 18న అజ్ఞాతవాసి ఆడియో లాంఛ్ ఫిక్స్ చేశారని అమరావతిలో కానీ హైదరాబాద్లో కానీ ఈ ఈవెంట్ను నిర్వహించాలని నిర్మాతలు భావిస్తున్నారట.
అయితే ఇలాంటి వేడుకలకు దూరంగా ఉండి ఎఫ్ఎం ద్వారా కానీ.. ఆన్లైన్ ద్వారా కానీ పాటలు విడుదల చేయాలని పవన్ ఆలోచిస్తున్నారట. ఆడియో విడుదల కార్యక్రమానికి భారీ స్థాయిలో అభిమానులు హాజరవుతారని.. వాళ్ల తాకిడికి ఆడిటోరియాలు సరిపోవని గతంలో అనుభవాలు గుర్తు చేస్తున్నాయి.. పోని ఓపెన్ ఏరియాల్లో పెడదామా అంటే అనుమతులు, నిబంధనలు అంటూ తలనొప్పులు ఎదురువుతాయని.. అందుకే ఇలాంటి ఇబ్బందులు లేకుండా సింపుల్గా పని కానిచ్చేయాలని పవర్స్టార్ భావిస్తున్నారట. ఇలా చేస్తే అభిమానులు హర్ట్ అవుతారని.. వారి కోసమైనా చిన్న ఫంక్షన్ చేద్దామని నిర్మాతలు ఆయనను ఒప్పించే పనిలో ఉన్నారట. మరి అజ్ఞాతవాసి పాటలు ఆన్లైన్లో వస్తాయో... ఫ్రీ రిలీజ్ ఫంక్షన్లో వస్తాయో క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.