సాయిపల్లవి మళ్ళీ ఫిదా చేస్తుంది
on Oct 10, 2018
శర్వానంద్, సాయిపల్లవి జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పడి పడి లేచె మనసు’. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ టీజర్లో శర్వానంద్, సాయిపల్లవిల జోడి ఆకట్టుకుంటుంది. ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సాయిపల్లవి మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఫిదా చేసింది. ఇప్పుడు 'పడి పడి లేచె మనసు' టీజర్ తో మళ్ళీ ఫిదా చేస్తుంది.
బ్యూటిఫుల్ మ్యూజిక్ తో స్టార్ట్ అయ్యే ఈ టీజర్ లో.. సాయిపల్లవి ఎక్కడికి వెళ్తే అక్కడ శర్వానంద్ ప్రత్యక్షమవుతూ ఫాలో అవుతూ ఉంటాడు. దీన్ని గమనించిన సాయిపల్లవి శర్వానంద్కి స్వీట్ వార్నింగ్ ఇస్తుంది. ‘ఓయ్ లేవయ్యా.. లే.. ఏంటి ఫాలో చేస్తున్నావా?’ అని సాయిపల్లవి అడుగుతుంది. దానికి బదులుగా శర్వానంద్ ‘అరె మీకు తెలిసిపోయిందా? అయినా మీరు ఇలా దగ్గరికి వచ్చి మాట్లాడటం ఏం బాగోలేదండీ. ఏదో నేను అర కిలోమీటరు దూరం నుంచి ప్రేమిస్తూ బతికేస్తుంటే..’ అని అంటాడు. మొత్తానికి టీజర్ క్యూట్ గా సాగిపోయింది. మరి శర్వానంద్, సాయిపల్లవిల జోడి టీజర్ తో ఫిదా చేసినట్టే సినిమాతో చేస్తారేమో చూడాలి.