దుబాయ్లో షూటింగుకు... సతీసమేతంగా నితిన్
on Nov 24, 2020
ఇన్నాళ్ళూ హీరో నితిన్ ఒంటరి. ఇప్పుడు కాదు! లాక్ డౌన్ సమయంలో షాలిని కందుకూరితో ఆయన ఏడడుగులు నడిచిన సంగతి తెలిసిందే. అందుకని, తొలిసారి షూటింగుకు సతీమణిని కూడా నితిన్ తీసుకుని వెళ్ళాడు. అసలు వివరాల్లోకి వెళితే....
నితిన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'రంగ్ దే'. ఈ సినిమా ఫారిన్ షెడ్యూల్ కోసం మంగళవారం ఉదయం శాలిని తో కలిసి నితిన్ దుబాయ్ వెళ్లారు. అక్కడ నుండి యూరోప్ కంట్రీ వెళతారని సమాచారం. దుబాయ్ లో కూడా కొంత షూటింగ్ చేస్తారట. బహుశ పెళ్లయిన తర్వాత నితిన్ అండ్ శాలినీ కలిసి వెళుతున్న ఫస్ట్ ఫారిన్ ట్రిప్ ఇదేనేమో?
కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. సంక్రాంతికి విడుదల చేయాలనేది ప్లాన్. డిసెంబర్ నుండి థియేటర్లు ఓపెన్ చేయడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది కాబట్టి సంక్రాంతికి అంతా సర్దుకుంటే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది.