అనామిక పాటల సందడి
on Apr 23, 2014
నయనతార ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'అనామిక'. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించాడు. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం నిన్న హైదరాబాదులో జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు మాట్లాడుతూ..."ఇది హిందీలో "కహానీ" పేరుతో విడుదలై మంచి విజయం సాధించిన ఈ చిత్రాన్నీ తెలుగులో రీమేక్ చేయాలంటే కొంచెం భయపడ్డాను. ఎందుకంటే అదే సినిమాను మళ్ళీ తీస్తే జనాలు ఎలా స్పందిస్తారో అనే భయంగా ఉండేది. కానీ ఇదే విషయం గురించి యండమూరి గారిని కలిసిన తర్వాత ఈ కథలో చాలా మార్పులు చేయడం జరిగింది. ఒక థ్రిల్లర్ మూవీ స్టైల్ లో తీయడం జరిగింది. మా చిత్రానికి కీరవాణి గారు సంగీతం అందించడం మాకు చాలా సంతోషంగా ఉంది. వేటూరి గారి తర్వాత నాకు బాగా నచ్చిన వారంటే అది కేవలం సిరివెన్నెల సీతారామశాస్త్రి గారే. ఈ చిత్రంలో నయనతార, వైభవ్ చాలా అధ్బుతంగా నటించారు" అని అన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిరధ మహారధులందరూ కూడా ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరారు. ఈ కార్యక్రమానికి ఎంఎం కీరవాణి, సిరివెన్నెల సీతారామశాస్త్రి , రమేష్ ప్రసాద్, నరేష్, వైభవ్, కోదండరామిరెడ్డిలతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.