మోక్షజ్ఞ ఎంట్రీకి ముహూర్తం ఫిక్సైనట్టేనా!!?
on Nov 13, 2018
నందమూరి నటసింహం బాలకృష్ణ వారసుడిగా తనయుడు మోక్షజ్క్ష ఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ రెండేళ్ల నుంచి న్యూస్ వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను కానీ క్రిష్ కానీ డైరక్టర్ గా వ్యవహరించవచ్చు అన్న వార్తలు కూడా వచ్చాయి. ఎందుకంటే బోయపాటి, క్రిస్ బాలకృష్ణ కు అద్భుతమైన చిత్రాలు ఇచ్చారు. అందుకే వారి పేర్లు తెరపైకొచ్చాయి. కానీ లేటెస్ట్ మోక్షజ్క్ష సినిమా గురించి సోషల్ మీడియాలో ఒక న్యూస్ హల్ చల్ చేస్తోంది. అదేంటంటే...మోక్షజ్క్ష ని హీరోగా పరిచయం బాధ్యత పూరిజగన్నాథ్ పై పెట్టాడట బాలకృష్ణ. రామ్ చరణ్ తో పాటు, కన్నడ హీరోలు పునీత్ రాజ్ కుమార్, ఇషాన్ లను హీరోలుగా పరిచయం చేసింది దర్శకుడు పూరిజగన్నాథే. మాస్, క్లాస్ ,యూత్ ఆడియన్స్ పల్స్ తెలిసిన దర్శకుడు పూరి. అందుకే పూరి అయితే బాగుంటుందని భావిస్తున్నాడట బాలయ్య. ఈ వార్త `పైసా వసూల్` సినిమా చేసే సమయంలో వచ్చినప్పటికీ ...ట్రాక్ ఎక్కలేదు. మరోసారి మోక్షజ్క్ష సినిమా పై వార్తలు వస్తున్నాయి. మరి ఈ సారైనా ట్రాక్ ఎక్కుతుందో లేదో చూద్దాం.