మచ్చటగా మూడో సీక్వెల్ లో నాగ్!!
on Mar 22, 2019
నాగార్జున, నాని కలిసి మల్టీస్టారర్ గా నటించిన `దేవదాస్` తర్వాత నాగార్జున ఏ సినిమా చేయలేదు. అయితే అతి త్వరలో రెండు సినిమాలను సెట్స్ మీదకు పనిలీ బిజీ బిజీగా ఉన్నాడు. ఒకటి మన్మథుడు-2 అయితే , `సోగ్గాడే చిన్నినాయనా కి కొనసాగింపుగా రెండో సినిమా చేయనున్నాడు. ఇలా రెండు సినిమాలు సీక్వెల్సే కావడం ఆసక్తికరమైన అంశం. ఇక ఇదిలా ఉంటే నాగార్జునకు సంబంధించిన మరో ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చేస్తోంది. ఇలా వరుసగా రెండు సీక్వల్స్ తో బిజీగా ఉన్న ఆయన డైరీలోకి మరో సీక్వెల్ చేరనుందట. గతంలో ఓంకార్ దర్శకత్వంలో `రాజు గారి గది -2 సినిమా నాగ్, సమంతలు చేసారు.
అయితే ఇప్పుడు ఆ చిత్రానికి కొనసాగింపుగా రాజుగారి గది -3 చిత్రం చేయనున్నాడని తెలుస్తోంది. ఈ చిత్రంలో నాగ్ తో పాటు మిల్కీబ్యూటీ తమన్నా కూడా నటిస్తుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అనౌన్స్ మెంట్ అధికారికంగా వచ్చే అవకాశాలున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి రాజు గారి గది-2 చిత్రం అనుకున్నంతగా ఆడలేదు. మరి ఈ మూడో భాగం అయిన విజయం చేకూరుస్తుందా మరి.