అల్లుడికి టచప్స్ ఇవ్వమన్న నాగార్జున
on Sep 4, 2018
అక్కినేని నాగ చైతన్య నటించిన తాజా చిత్రం "శైలజారెడ్డి అల్లుడు". ఈ చిత్రంలో అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా నటించగా, సీనియర్ నటి రమ్యకృష్ణ అత్తగా నటించింది. ఈ చిత్రం ఆగస్ట్ 31వ తేదీన విడుదల కావాల్సి వుంది. అయితే, అనివార్య కారణాల రీత్యా ఈ చిత్రం విడుదలను వాయిదా వేశారు. ఇక ఈ చిత్రాన్ని ఈ నెల 13వ తేదీ వినాయక చవితి సందర్భంగా ప్రేక్షల ముందుకు తీసుకోస్తున్నారు చిత్ర బృంధం.మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలై ప్రేక్షక లోకాన్ని ఆకట్టుకుంటోంది.
కాగా... ఇటీవలే ఈ చిత్రాన్ని చూసిన నాగార్జున కొన్ని కొన్ని సన్నివేశాల విషయంలో మరీ ఎక్కువగా కాకుండా చాలా తక్కువగానే అభ్యంతరాలు చెప్పాడట. అంతే కాకుండా ఎక్కడేక్కడ టచప్స్ ఈస్తే సినిమా హిట్ కొడుతుందో కూడా వివరించారట. నాగ్ అభిప్రాయాలతో దర్శకుడు మారుతి.. ఇతర చిత్ర బృందం కూడా అంగీకరించిందని.. ఆ సన్నివేశాలకు కొంచెం టచప్స్ ఇవ్వడానికి సిద్ధమైందని చైతూ చెప్పాడు.