సొంత బేనర్లో సొంత కథతో నాగశౌర్య!!
on May 11, 2019
`ఛలో` తో ఐరా క్రియేషన్స్ సంస్థ ప్రారంభమైంది. ఆ సినిమా పెద్ద సక్సెస్ సాధించి మంచి లాభాలు కూడా తెచ్చి పెట్టింది. ఆ తర్వాత `నర్తనశాల` రెండో చిత్రంగా ఐరా లో వచ్చింది. కానీ ఆ సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది. దర్శకుడిని నమ్మి మోసపోయామని చాలాసార్లు చెప్పారు నిర్మాతలు. ఇక నాగశౌర్య సొంత బేనర్ లో కొంత గ్యాప్ ఇచ్చి బయట బేనర్స్ లో సినిమాలు చేద్దాం అనుకుని భవ్య ఫిలింస్లో, సుకుమార్ రైటింగ్స్ లో సినిమాలు ఒప్పుకున్నాడు. ఏమైందో ఏమో కానీ, ఆ రెండు ప్రాజెక్ట్స్ సడెన్ గా క్యాన్సిల్ అయ్యాయి. ఇక మళ్లీ సొంత బేనర్లో సొంత కథతో వస్తున్నాడు నాగశౌర్య. ఈ సినిమాల ఈ రోజు సంస్థ కార్యాలయ్యంలో ఘనంగా ప్రారంభమైంది.
ఈ చిత్రంతో రమణ తేజ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శంకర్ ప్రసాద్ సమర్పణలో ఉషాముల్పూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రంలో నాగశౌర్యకి జంటగా మెహరీన్ నటిస్తుంది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు క్లాప్ కొట్టి స్క్రిప్ట్ ని డైరెక్టర్ రమణ తేజకు అందించగా.. పరశురామ్ గౌరవదర్శకత్వం వహించారు. దర్శకురాలు నందిని రెడ్డి కెమెరా స్విచాన్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో... హీరో నాగశౌర్య మాట్లాడుతూ - " మా బ్యానేర్ ఐరా క్రియేషన్స్ లో ప్రొడక్షన్ నెంబర్ 3 చిత్రాన్ని ప్రారంభించాము. రెగ్యులర్ షూటింగ్ మే 13నుంచి మొదలవుతుంది. 70శాతం షూటింగ్ వైజాగ్లో చేయాలని ప్లాన్ చేస్తున్నాం. రమణతేజ ఈ చిత్రంతో దర్శకుడుగా పరిచయమవుతున్నాడు. నేను, నా ఫ్రెండ్ ఇద్దరం యు.ఎస్. లో బోస్టన్ ఫిల్మ్ స్కూల్లో కలిశాం. మంచి కథ డెఫినెట్ గా బాగా తీస్తారని ఆశిస్తున్నాను. మెహ్రీన్తో కలిసి పని చేయడం ఇదే మొదటి సారి. మా ప్రొడక్షన్లో వచ్చిన ఫస్ట్ సినిమాకంటే పెద్ద హిట్ అవుతుంది" అన్నారు.
చిత్ర దర్శకుడు రమణ తేజ మాట్లాడుతూ - " ఈ రోజు నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా కృతజ్ఞతలు. నాకు ఈ సినిమా ఇచ్చిన మా శౌర్య అన్నయ్యకు చాలా థ్యాంక్స్. నన్ను నమ్మి నాకు ఇంత మంచి కథ ఇచ్చి డైరెక్టర్గా నిలబెట్టిన ప్రొడ్యూసర్స్కి నా ప్రత్యేక ధన్యవాదాలు. కెమెరామెన్ మనోజ్ నాకు మంచి మిత్రుడు. ఇద్దరం అదే ఫిలిం స్కూల్ లో చదివాము. మా ఇద్దరికి మంచి ర్యాపొ ఉంది. ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్న మెహ్రీన్కి థ్యాంక్స్ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది " అన్నారు.