నాగబాబూ... ఆరో కౌంటర్
on Jan 11, 2019
ఇప్పటికైనా రియలైజ్ అయి సైలెంట్ గా ఉంటే సరే...మళ్లీ వ్యక్తిగత విమర్శలకు దిగితే...మాత్రం మరోసారి మీ జోలికి రావాల్సి ఉంటుందంటూ బాలకృష్ణను హెచ్చరించారు నాగబాబు. ఇటీవల వరుసగా నాగబాబు బాలకృష్ణ గతంలో చేసిన కామెంట్స్ పై ఫేస్ బుక్ ద్వారా ఒక్కో వీడియో విడుదల చేస్తూ మాటల యుద్ధం చేస్తోన్న విషయం తెలిసిందే. ఆరో వీడియో గురువారం సాయంత్రం విడదుల చేశారు. ఈ వీడియోలో వివాదం ముగిసిందంటూనే మల్లీ మా జోలికి వస్తే... అంటూ బాలకృష్ణకు మరో వార్నింగ్ ఇచ్చారు మెగాబ్రదర్ నాగబాబు. ఇప్పటికైతే వివాదానికి నాగబాబు ఫుల్ స్టాప్ పెడుతున్నట్లు తెలిపాడు వీడియో ద్వారా. ఆరో కౌంటర్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ఒకసారి ఆరో వీడియో గురించి వస్తే...2012లో బాలకృష్ణ ఓ ఇంటర్య్వూ లో మాట్లాడుతూ...`` చిరంజీవి ..ఎన్టీఆర్ కాలిగోటికి కూడా సరిపోడంటూ ఓ స్టేట్ మెంట్ ఇచ్చారు ... ఆ సమయంలో మా ఫ్యామిలీ అంతా ఆవేశానికి లోనైనప్పటికీ అన్నయ్య పెద్ద మనిషి తరహాలో స్పందించి ఆ వివాదాన్ని క్లోజ్ చేసారు చిరంజీవి అన్నయ్య. అయితే అప్పటి కామెంట్ ఇప్పుడు స్పందిస్తున్నారు ఏంటి అని అందరూ అడుగుతున్నారు. మనల్ని కొట్టి పారిపోయినోడు ఏడాది తర్వాత కనిపిస్తే చూస్తూ ..ఊరుకుంటామా ? అంటూ ప్రశ్నకు బదులిస్తున్నాడట. భరిస్తున్నాం కదా అని ఏది పడితే అది అంటే ఊరుకోం. ఒళ్ళు మండినప్పుడు మాత్రం కచ్చితంగా రియాక్ట్ అవుతామంటూ వీడియోలో చెప్పుకొచ్చాడు.
ఎవరి నాన్న వాళ్లకు గొప్ప...మా అన్నయ్య మాకు గొప్ప...చిరంజీవి అంటే మాకు తండ్రితో సమానం. కాబట్టి ఎప్పుడు ఎవర్నీ కించపరిచే విధంగా మాట్లాడకండి.. అంటూ బాలయ్యకు హితవు పలికారు. నేను ఇప్పటి తో ముగింపు పలుకుతున్నాను అని ...దీన్ని బాలకృష్ణ గారు కొనసాగించాలనుకుంటే ఆయన ఇష్టం ...అన్నారు. ఇక మీదట హద్దుల్లో మాట్లాడలని సున్నితంగా హెచ్చరించారు. అభిమానులు కూడా ఎవరూ భావోద్వేగపూరితంగా రియాక్ట్ కావద్దనీ...చెప్పారు. అందరి సినిమాలు చూడాలని చెప్పారు. మరి నందమూరి ఫ్యాన్స్ నుంచి దీనికి ఎలాంటి స్పందన్ ఉండబోతుందో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చూద్దాం ఈ వివాదం ఇప్పడితో ముగుస్తుందో లేక కొనాసాగుతుందో..!!