తారక్, చరణ్ల మల్టీస్టారర్ కు ముహూర్తం ఖరారు
on Jun 18, 2018
బాహుబలి తరువాత రాజమౌళి ఏ హీరోతో సినిమా చేస్తాడా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసారు.. స్టార్ హీరోలు తారక్, చరణ్ లతో మల్టీస్టారర్ అని తెలియగానే ప్రేక్షకుల ఆనందానికి అవధుల్లేవు.. సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది? సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అంటూ రెట్టింపు ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు.. అయితే ఇప్పడు ఈ సినిమా షూటింగ్ మరియు రిలీజ్ డేట్స్ గురించి ఒక వార్త బైటికొచ్చింది.. ఈ సినిమా అక్టోబర్ లో లాంచ్ అయ్యి నవంబర్ నుండి షూటింగ్ మొదలవుతుందట.. అలానే 2019 చివరిలో లేదా 2020 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.. అంటే ఈ ముల్టీస్టారర్ కోసం సుమారు ఏడాదిన్నర ఎదురు చూడాలన్నమాట.